తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రశాంతం
ABN , First Publish Date - 2021-04-19T06:43:29+05:30 IST
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అబ్జర్వర్ దినేష్కుమార్ గిరిధర్లాల్ వెల్లడించారు.
అబ్జర్వర్ దినేష్కుమార్ గిరిధర్లాల్
స్ట్రాంగ్ రూమ్లోకి ఈవీఎంలు
తిరుపతి(రవాణా), ఏప్రిల్ 18: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల అబ్జర్వర్ దినేష్కుమార్ గిరిధర్లాల్ వెల్లడించారు. ఆదివారం పార్లమెంటు పరిధిలోని తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన ఈవీఎంలు పటిష్ఠ భద్రత మధ్య తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా స్ర్కూట్నీతోపాటు స్ట్రాంగ్రూమ్లకు సీలు వేయడం తదితరాలను రాజకీయ పార్టీల ఏజెంట్లు, ఏఆర్వోల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్జర్వర్ మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా సాగిందన్నారు. తాను 15 పోలింగ్ కేంద్రాలను పరిశీలించానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్, నగర పాలక సంస్థ కమిషనర్ గిరీష, చిత్తూరు, అర్బన్ ఎస్పీలు సెంథిల్కుమార్, వెంకటఅప్పలనాయుడు, జేసీ వీరబ్రహ్మం, తిరుపతి, సత్యవేడు, శ్రీకాళహస్తి ఏఆర్వోలు చంద్రమౌళీశ్వరరెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.