గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

ABN , First Publish Date - 2020-09-26T07:23:47+05:30 IST

వంట గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. జువ్వలపాలెం క్రిస్టియన్‌పేటలో కోనాల విక్టోరియమ్మ శుక్రవారం ఉద యం వంట చేసుకునే సమయంలో గ్యాస్‌ బండ లీకై మంటలు చెలరేగడంతో తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది.

గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధం

కాళ్ళ, సెప్టెంబరు 25 : వంట గ్యాస్‌ లీకై తాటాకిల్లు దగ్ధమైన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. జువ్వలపాలెం క్రిస్టియన్‌పేటలో కోనాల విక్టోరియమ్మ శుక్రవారం ఉద యం వంట చేసుకునే సమయంలో గ్యాస్‌ బండ లీకై మంటలు చెలరేగడంతో తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది.


ఇంట్లో ఉన్న వస్తువులతో పాటు పిల్లల కళాశాల సర్టిఫికెట్లు, నగదు, బంగారం పూర్తిగా కాలిపోయాయి. ఆకివీడు అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.


గ్రామ కార్యదర్శి పి సరళ, వీఆర్వో రఘులు సంఘటనా స్ధలాన్ని పరిశీలించి రూ.2.50లక్షల ఆస్తి నష్టం వచ్చినట్లు అంచనా వేశారు. అగ్ని ప్రమాదం లో నిరాశ్రయులైన బాధిత కుటుంబానికి కఠారి లక్ష్మీపతిరాజు రూ.10వేల నగదు, 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, వంట సామగ్రి, దుస్తులు అందజేశారు.

Updated Date - 2020-09-26T07:23:47+05:30 IST