రైతులకు మరిన్ని సేవలు
ABN , First Publish Date - 2020-09-26T07:19:01+05:30 IST
కోపల్లె సొసైటీ పరిధిలోని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నామని సొసై టీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ వేగేశ్న రవిరాజు అన్నారు.
కాళ్ళ, సెప్టెంబరు 25 : కోపల్లె సొసైటీ పరిధిలోని రైతులకు మరిన్ని సేవలందించేందుకు కృషి చేస్తున్నామని సొసై టీ త్రిసభ్య కమిటీ ఛైర్మన్ వేగేశ్న రవిరాజు అన్నారు. కోపల్లె సహకార సంఘం సాధారణ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంఘం పరిధిలో రైతులకు 18శాతం డివిడెండ్ అందజేశామన్నారు.
అనంతరం బ్యాంకు కార్యకలాపాలు, సొసైటీ అభివృద్ధి, రైతులకు అందిం చాల్సిన సేవలపై చర్చించారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు గోళ్ళ వెంకట రాంబాబు, గణేశ్న రాంబాబు, సొసైటీ సీఈవో కొత్తపల్లి శ్రీనివాసరాజు, తదితరులు పాల్గొన్నారు.