నేటినుంచి సేలం, ధర్మపురి జిల్లాల్లో సీఎం పర్యటన
ABN , First Publish Date - 2021-09-29T13:40:34+05:30 IST
ముఖ్యమంత్రి స్టాలిన్ సేలం, ధర్మపురి జిల్లాల్లో బుధవారం నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. ‘వరుమున్ కాప్పోం’ పథకాన్ని సేలం జిల్లా వాలప్పాడి నియోజకవర్గంలో సీఎం ప్రారంభించనున్నారు. ఇందు
ప్యారీస్(చెన్నై): ముఖ్యమంత్రి స్టాలిన్ సేలం, ధర్మపురి జిల్లాల్లో బుధవారం నుంచి రెండు రోజులు పర్యటించనున్నారు. ‘వరుమున్ కాప్పోం’ పథకాన్ని సేలం జిల్లా వాలప్పాడి నియోజకవర్గంలో సీఎం ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన బుధవారం ఉదయం 8.30 గంటలకు నగరం నుంచి విమానంలో సేలం బయల్దేరి వెళ్తారు. విమానాశ్రయం నుంచి 10 గంటలకు కారులో వాలప్పాడి చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి ఆత్తూర్కు వెళ్లి కొత్తగా నిర్మించిన ప్రాంతీయ ట్రాఫిక్ విభాగం కార్యాలయాన్ని సీఎం ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విశ్రాంతి అనంతరం స్టాలిన్ సేలం కరుప్పూర్ ప్రాంతంలో ఉన్న పారిశ్రామికవాడను సందర్శిస్తారు. ఆ కార్యక్రమం ముగించుకొని 6 గంటలకు సీఎం ధర్మపురి చేరుకొని రాత్రి అక్కడ హోటల్లో బసచేస్తారు. 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు ధర్మపురిలోని ప్రభుత్వ వైద్యకళాశాలలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి హొగెనేకల్కు వెళ్లి సంయుక్త తాగునీటి పథకం, పంపింగ్ స్టేషన్ సందర్శిస్తారు.