నాడు పేదల ఆకలి తీర్చి.. నేడు నిరుపయోగంగా మారి
ABN , First Publish Date - 2021-08-02T06:26:45+05:30 IST
నాడు.. ఎందరో పేదలకు రూ.5తో ఆకలి తీర్చిన భవనమిది. దీనికోసం శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో రూ.కోటితో ప్రభుత్వాస్పత్రి మార్గంలోను, రామసేతు వంతెన సమీపంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ భవనాలు నిర్మించింది. నేడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భవనాలు మూతపడ్డాయి. నిరుపయోగంగా మారడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి.
అధ్వానంగా అన్న క్యాంటీన్ భవనాలు
(శ్రీకాళహస్తి అర్బన్)
నాడు.. ఎందరో పేదలకు రూ.5తో ఆకలి తీర్చిన భవనమిది. దీనికోసం శ్రీకాళహస్తి పట్టణ పరిధిలో రూ.కోటితో ప్రభుత్వాస్పత్రి మార్గంలోను, రామసేతు వంతెన సమీపంలో గత ప్రభుత్వం అన్న క్యాంటీన్ భవనాలు నిర్మించింది. నేడు.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ భవనాలు మూతపడ్డాయి. నిరుపయోగంగా మారడంతో శిథిలావస్థకు చేరుతున్నాయి. వీటి నిర్మాణానికి వెచ్చించిన ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారుతోంది. ఒకప్పుడు పేదల ఆకలిని తీర్చిన ప్రభుత్వాస్పత్రి మార్గంలోని అన్న క్యాంటీన్ భవనం ప్రస్తుతం ఆకతాయిలకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ భవనాలను వినియోగంలోకి తేవాల్సి ఉంది.