నేడు లైట్లు మాత్రమే బంద్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-04-05T11:13:36+05:30 IST

ప్రధానమంత్రి నరంద్రమోదీ పిలుపు మేరకు ఆది వారం రాత్రి కేవలం లైట్లు మాత్రమే బంద్‌ చేయాలని విద్యుత్‌ శాఖ సీఎండీ గోపాల్‌రావు ఒక ప్రకటనలో వినియోగదారులను కోరారు. లైట్లను

నేడు లైట్లు మాత్రమే బంద్‌ చేయాలి

విద్యుత్‌ శాఖ సీఎండీ గోపాల్‌రావు పిలుపు


సుభాష్‌నగర్‌, ఏప్రిల్‌ 4: ప్రధానమంత్రి నరంద్రమోదీ పిలుపు మేరకు ఆది వారం రాత్రి కేవలం లైట్లు మాత్రమే బంద్‌ చేయాలని విద్యుత్‌ శాఖ సీఎండీ గోపాల్‌రావు ఒక ప్రకటనలో వినియోగదారులను కోరారు. లైట్లను మాత్రమే బంద్‌ చేసి ఇంట్లో ఉన్న ఫ్రిజ్‌, ఇతర ఎలక్ర్టికల్‌ వస్తువులను ఆన్‌లోనే ఉంచాలని  ఆయన సూచించారు. ఒకేసారి అన్ని విద్యుత్‌ పరికరాలు బంద్‌ చేయడం వలన లోడ్‌ ఒకేసారి పడిపోయి ఇబ్బంది తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆయన పేర్కొ న్నారు. ఆదివారం  రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు కేవలం ఇంట్లో ఉన్న  లైట్లను మాత్రమే ఆర్పి ఫ్రిజ్‌, ఫ్యాన్లు, టవీలను అలాగే ఉంచాలని  కోరా రు. ప్రజలు, విద్యుత్‌ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Updated Date - 2020-04-05T11:13:36+05:30 IST