నకిలీ డాక్యుమెంట్లతో రూ.10 లక్షలకు టోకరా
ABN , First Publish Date - 2020-05-31T10:24:16+05:30 IST
నకిలీ డాక్యుమెంట్స్తో ఓ వ్యక్తి రూ.10 లక్షలు రుణం తీసుకుని బ్యాంకు అధికారులను మోసగించాడు
బర్కత్పుర, మే 30 (ఆంధ్రజ్యోతి): నకిలీ డాక్యుమెంట్స్తో ఓ వ్యక్తి రూ.10 లక్షలు రుణం తీసుకుని బ్యాంకు అధికారులను మోసగించాడు. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్రకారం... మహ్మద్ ఇమ్రాన్ ఖాన్ (అకౌంట్ నెంబర్ 37903281539) బర్కత్పుర ఎస్బీఐ బ్యాంకులో కారు కొనుగోలు కోసం రూ.10 లక్షల రుణాన్ని 2018వ సంవత్సరంలో తీసుకున్నాడు.
అప్పటి నుంచి అతను కనిపించకుండా పోయాడు. ఇమ్రాన్ఖాన్ సమర్పించిన డాక్యుమెంట్లు బ్యాంకు అధికారుల విచారణలో నకిలీవని తేలాయి. ఈ మేరకు బర్కత్పుర ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ లావణ్య కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇమ్రాన్ఖాన్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.