సంసారాన్ని రట్టు చేసిందని.. చలాకుతో కాల్చింది
ABN , First Publish Date - 2020-08-03T10:17:43+05:30 IST
సంసార విషయాలను బయట వ్యక్తులకు చెబుతోందన్న కారణంతో కన్నతల్లి తన బిడ్డకు చలాకుతో వాతలు పెట్టిందని సీఐ రామకృష్ణ ..
కన్నబిడ్డను చిత్రహింసలు పెట్టిన తల్లిపై కొనసాగిన విచారణ
వివరాలు వెల్లడించిన సీఐ రామకృష్ణ
కదిరి, ఆగస్టు 2: సంసార విషయాలను బయట వ్యక్తులకు చెబుతోందన్న కారణంతో కన్నతల్లి తన బిడ్డకు చలాకుతో వాతలు పెట్టిందని సీఐ రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని కందికుంట నారాయణమ్మ కాలనీలో నివాసం ఉండే బోయ రామాంజినమ్మ అలియాస్ గీత కర్ణాటక రాష్ట్రం.. పావగడ తాలుకా.. గుమ్మగట్ట గ్రామ నివాసి. ఏడాది క్రితం కదిరికి వచ్చి నివాసం ఉంటోంది. ఆమెకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. వారం కిందట ఆ చిన్నారి శరీరంపై కాలుతున్న చలాకుతో వాతలు పెట్టింది. గత శనివారం విషయాన్ని తెలుసుకున్న స్థానికులు సమాచారాన్ని ఛైల్డ్లైన్కు, పోలీసులకు తెలిపారు.
పోలీసులు వెంటనే వచ్చి ఆ తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఇంటి విషయాలు బయటకు చెబుతున్నదన్న కారణంతోనే తనబిడ్డకు వాతలు పె ట్టినట్లు తల్లి విచారణలో ఒప్పుకుంది. లోతుగా విచారించగా.. ఆమె ఆరు నెలల కిం దట తనకు పుట్టిన ఆడబిడ్డను అనంతపురానికి చెందిన వ్యక్తులకు రూ. 50 వేలకు అమ్మేసినట్లు తెలిసింది. ఐసీడీఎస్ సూపర్వైజర్ రఫీమున్నీసా ఫిర్యాదు మేరకు తల్లిపై కేసు నమోదైంది. గాయపడిన బాలికకు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చే యిస్తున్నామని, కరోనా టెస్ట్ చేయించి తర్వాత అనంతపురంలోని బాలికల వసతి గృహానికి తరలిస్తామని, అమ్మేసిన పాప గురించి విచారణ చేస్తున్నామని తెలిపారు.