సీఎంతో రమణదీక్షితులు భేటీ
ABN , First Publish Date - 2020-09-24T10:56:55+05:30 IST
శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను పద్మావతి అతిథిగృహంలో రాత్రి 8 గంటలకు టీటీడీ గౌరవ
తిరుమల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ను పద్మావతి అతిథిగృహంలో రాత్రి 8 గంటలకు టీటీడీ గౌరవ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు కలిశారు.అర్చకులకు పదవీ విరమణ వర్తింపుతో తాను కోల్పోయిన ప్రధాన అర్చకత్వాన్ని తిరిగి కేటాయించాలని కోరినట్టు సమాచారం.
అలాగే ప్రస్తుతం టీటీడీలో జరుగుతున్న కొన్ని అంశాలు కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల టీటీడీ అధికారుల నిర్ణయాలపై వరుస విమర్శలు చేస్తూ వచ్చిన రమణదీక్షితులు ముఖ్యమంత్రిని కలవడం చర్చనీయాంశమైంది.