ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం
ABN , First Publish Date - 2021-03-05T06:36:32+05:30 IST
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దకోడూరులో గురువారం జరిగింది.
చిన్నకోడూరు, మార్చి 4: ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన ఘటన మండలంలోని పెద్దకోడూరులో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామానికి చెందిన డ్రైవర్ పిట్ల వంశి పెద్దకోడూరులో ఓ రైతు వ్యవసాయ బావి వద్ద భూమిని ట్రాక్టర్తో చదును చేస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఒడ్డుపై నుంచి ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తాపడటంతో డ్రైవర్ వంశీ దానికింద ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృత దేహాన్ని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.