నవంబరు 2నుంచి బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు
ABN , First Publish Date - 2020-10-30T00:27:12+05:30 IST
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు.
గాజువాక: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయనాయకులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్ సునీల్ దేవధర్, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్.మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజులతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఆయన వెంటన కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకరరావు, దీనంకొండ కృష్ణంరాజు, వర్రి లలిత పాల్గొన్నారు.