నవంబరు 2నుంచి బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు

ABN , First Publish Date - 2020-10-30T00:27:12+05:30 IST

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు.

నవంబరు 2నుంచి బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు
సమావేశ ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నేతలు రవీంద్ర, కరణంరెడ్డి నరసింగరావు

గాజువాక: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యమని పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర అన్నారు. నవంబరు 2, 3 తేదీల్లో గాజువాకలో జరగనున్న పార్టీ శిక్షణ తరగతుల ప్రాంగణాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిక్షణ తరగతులకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయనాయకులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ సునీల్‌ దేవధర్‌, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి, ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజులతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతారన్నారు. ఆయన వెంటన కన్వీనర్‌ కరణంరెడ్డి నరసింగరావు, సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకరరావు, దీనంకొండ కృష్ణంరాజు, వర్రి లలిత పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-30T00:27:12+05:30 IST