విధి నిర్వహణలో శిక్షణ ఎంతో దోహదం

ABN , First Publish Date - 2021-02-25T04:56:24+05:30 IST

రాష్ట్ర ప్రత్యేక ఏడో పోలీసు బెటాలియన్‌లో ఫ్రీ ప్రమోషనల్‌ ట్రైనీంగ్‌ శిక్షణ పూర్తిచేసుకున్న ఏఆర్‌ ఎసై్ౖసలు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఇన్‌చార్జి డీఐజీ ఎంఎస్‌ సిద్ధిఖీ అన్నారు.

విధి నిర్వహణలో శిక్షణ ఎంతో దోహదం

డిచ్‌పల్లి, ఫిబ్రవరి24: రాష్ట్ర ప్రత్యేక ఏడో పోలీసు బెటాలియన్‌లో ఫ్రీ ప్రమోషనల్‌ ట్రైనీంగ్‌ శిక్షణ పూర్తిచేసుకున్న ఏఆర్‌ ఎసై్ౖసలు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని ఇన్‌చార్జి డీఐజీ ఎంఎస్‌ సిద్ధిఖీ అన్నారు. ఈ సందర్భంగా ఏఆర్‌ఎస్సైల నుంచి ఆర్‌ఎస్సైలుగా, కానిస్టేబుల్‌ నుంచి హెడ్‌ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన వారందరు విధి నిర్వహణలో ఫ్రెండ్లీ పోలీసుగా వ్యవహరించి ఏడో బెటాలియన్‌ పేరును నలు దిశలా చాటాలన్నారు. ఈ సందర్భంగా కమాండెంట్‌ సత్యశ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పదోన్నతి పొందిన ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో బాధ్యతగా మెలగాలని సూచించారు. కార్యక్రమంలో 5వ బెటాలియన్‌(కొత్తగూడెం) కమాండెంట్‌ చటర్జి, అసిస్టెంట్‌ కమాండెంట్లు  రమణ, బాలయ్య, ఆర్‌ఐలు, రాజు, వెంకటేశ్వర్లు, అనిల్‌ కుమార్‌, మహే శ్‌, నరేశ్‌, వసంత్‌రావు, ప్రహ్లద్‌, సురేశ్‌, సర్ధార్‌ నాయక్‌, ఆర్‌ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T04:56:24+05:30 IST