22న మున్సిపల్‌ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-06-18T05:16:51+05:30 IST

కోర్టు ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు 22న బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈవో నరసింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

22న మున్సిపల్‌ టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్‌

చిత్తూరు(సెంట్రల్‌), జూన్‌ 17: కోర్టు ఆదేశాల మేరకు మున్సిపాలిటీల పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు 22న బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈవో నరసింహారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీకి పొందే టీచర్ల వివరాలను ఆయా డీవైఈవో, ఎంఈవోలకు పంపినట్లు చెప్పారు. 22వ తేదీ ఉదయం 9 గంటలకు డీఈవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో చేపట్టే కౌన్సెలింగ్‌కు మున్సిపల్‌ టీచర్లు తప్పక హాజరుకావాలని సూచించారు. 

Updated Date - 2021-06-18T05:16:51+05:30 IST