రైల్వే ట్రాక్పై ప్రయాణం నిషేధం
ABN , First Publish Date - 2020-04-09T12:10:58+05:30 IST
రైల్వే ట్రాక్ గుండా ఏ ఒక్కరు వచ్చినా ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని జీఆర్పీఎస్ ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు.
కొమరాడ, ఏప్రిల్ 8: రైల్వే ట్రాక్ గుండా ఏ ఒక్కరు వచ్చినా ప్రభుత్వ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని జీఆర్పీఎస్ ఎస్ఐ ఉపేంద్ర తెలిపారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు రైల్వేస్టేషన్ కూనేరు సమీపంలో జీఆర్పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ పరిశీలనలో హెచ్సీ రత్నకర్, తదితరులు పాల్గొన్నారు.