పరిటాలకు నివాళి
ABN , First Publish Date - 2022-01-25T05:28:06+05:30 IST
ప్రజల మనిషిగా స్వర్గీయ పరిటాల రవీంద్ర చెరగని ముద్ర వేసుకున్నారని టీడీపీ నాయకులు పేర్కొ న్నారు.
ఒంగోలు (కార్పొరేషన్), జనవరి 24: ప్రజల మనిషిగా స్వర్గీయ పరిటాల రవీంద్ర చెరగని ముద్ర వేసుకున్నారని టీడీపీ నాయకులు పేర్కొ న్నారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర 17వ వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం అంజయ్య రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు నల్లూరి ప్రదీప్, ఒంగోలు పార్లమెంట్ కార్యదర్శి దాయినేని ధర్మ నేతృత్వం వహించగా, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు,నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు తదితరు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల్ నగర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేయడంతోపాటు, పరిటాల రవీంద్ర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో తెలుగు మహిళ రాష్ట్ర ఉపా ధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమ కుమారి, నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఎం.పావని, నండూరి చం ద్ర, పలువురు పరిటాల అభిమానులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు బడుగు, బలహీన వర్గాల గుండెల్లో నిలిచిన చిరస్మరణీయుడు పరిటాల రవీంద్ర అని టీడీపీ మండల అధ్యక్షు డు మద్దినేని హరిబాబు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పరిచాల చిత్రపటానికి పూలమాలవేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో నాయకులు ఎం.శ్రీనివాసరావు, ఎన్.మాధవి, ఎన్.పోతురాజు, బి.సుబ్బారావు, ఎస్.వెంకట్రావు, పి.భాస్కర్రావు, వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.