220 కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు
ABN , First Publish Date - 2021-09-17T06:01:11+05:30 IST
కొబ్బరి కాయల బస్తాల మాటున గురు వారం గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని వాహనంతో సహా పట్టుకున్నట్టు రూరల్ ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
ఎలమంచిలి, సెప్టెంబరు 16 : కొబ్బరి కాయల బస్తాల మాటున గురు వారం గంజాయిని తరలించేందుకు ప్రయత్నిస్తున్న వారిని వాహనంతో సహా పట్టుకున్నట్టు రూరల్ ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. మండలంలోని రేగుపాలెం సమీపం పోలవరం కాలువ వద్ద ఓ వాహనంలో కొబ్బరి కాయల బస్తాలను లోడు చేశారు. అందులో 220 కిలోల గంజాయిని బస్తాల్లో నింపి ఉంచారు. దీనిపై అందిన సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి దాడి చేయగా మధ్యప్రదేశ్కు చెందిన జలాల్ మన్సూరీ, జమల్ షేక్లు పట్టుబడగా, మరో ఇద్దరు పరారైనట్టు చెప్పారు. వీరి నుంచి 125 కొబ్బరి కాయల బస్తాలు, గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లు, వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు.