ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిని కాల్చిచంపిన కానిస్టేబుల్

ABN , First Publish Date - 2020-08-04T21:27:41+05:30 IST

ఒకే యూనిట్‌కు చెందిన ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఒక కానిస్టేబుల్ కాల్పులు..

ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిని కాల్చిచంపిన కానిస్టేబుల్

రాయ్‌గంజ్: ఒకే యూనిట్‌కు చెందిన ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందిపై బుధవారం తెల్లవారుజామున ఒక కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు బీఎస్‌ఎఫ్ సిబ్బంది మృతిచెందారు.  బెంగాల్‌లోని నార్త్ దినజ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


పోలీసుల కథనం ప్రకారం, మాల్డాఖండ్‌‌కు చెందిన బీఎస్ఎఫ్ 146వ బెటాలియన్ కానిస్టేబుల్ ఉత్తమ్ సూత్రధార్ తన బెటాలియన్‌కే చెందిన ఇన్‌స్పెక్టర్ మహిందర్ సింగ్ భట్టి, కానిస్టేబుల్ అనుజ్ కుమార్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో భట్టి, కుమార్‌లు అక్కడికక్కడే మృతి చెందినట్టు రాయ్‌గంజ్ పోలీస్ సూపరింటెండెండ్ తెలిపారు. కాల్పుల అనంతరం తన కమాండర్ ముందు ఉత్తమ్ సూత్రధార్ లొంగిపోయాడని, రాయ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అతనిని తరలించి తదుపరి విచారణ జరుపుతున్నట్టు ఆయన చెప్పారు.

Updated Date - 2020-08-04T21:27:41+05:30 IST