పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-10-23T06:03:58+05:30 IST

పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు శుక్రవారం అమలాపురం పట్టణ పోలీసులు తెలిపారు.

పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు

అమలాపురం టౌన్‌, అక్టోబరు 22: పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదు చేసినట్టు శుక్రవారం అమలాపురం పట్టణ పోలీసులు తెలిపారు. మలికిపురానికి చెందిన వల్లూరి మల్లేశ్వరరావు, పెదపట్నంలంకకు చెందిన రాయుడు శార్వాణి కొంత కాలం కలిసి జీవించారు. తర్వాత అతడితో ఆమె విడిపోయి ప్రస్తుతం అయితాబత్తుల ఈశ్వరరావుతో కలిసి ఉంటుంది. ఈనెల21న అమలాపురం సూర్యనగర్‌ సమీపంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ వద్ద ఉన్న మల్లేశ్వరరావును ఈశ్వరరావు రూ.30లక్షలు ఇవ్వాలని బెదిరించడంతో పాటు భౌతికంగా దాడిచేసి గాయపరిచాడు. స్థానిక ఆసుపత్రిలో చేరిన మల్లేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈశ్వరరావుపై కేసు నమోదు చేశారు. అలాగే స్థానిక సూర్యనగర్‌లో ఉంటున్న శార్వాణి ఈనెల21న ఇంటికి వెళ్తుండగా వెనుక నుంచి భర్త వల్లూరి మల్లేశ్వరరావు బ్లేడు వంటి పదునైన ఆయుధంతో దాడిచేసి గాయపర్చాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదుపై మల్లేశ్వరరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-10-23T06:03:58+05:30 IST