వలసకార్మికులకు సేవలందించిన ఇద్దరు హోంగార్డులకు కరోనా

ABN , First Publish Date - 2020-05-28T12:47:02+05:30 IST

రైల్వేస్టేషనులో విధులు నిర్వర్తించిన ఇద్దరు హోంగార్డులకు కరోనా సోకిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా జగన్నాథపూర్ రైల్వేస్టేషనులో ....

వలసకార్మికులకు సేవలందించిన ఇద్దరు హోంగార్డులకు కరోనా

భువనేశ్వర్ (ఒడిశా): శ్రామిక్ స్పెషల్ రైళ్లలో వలసకార్మికులను ఎక్కించేలా రైల్వేస్టేషనులో విధులు నిర్వర్తించిన ఇద్దరు హోంగార్డులకు కరోనా  సోకిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా జగన్నాథపూర్ రైల్వేస్టేషనులో వెలుగుచూసింది. పొలాసర పోలీసుస్టేషనుకు చెందిన ఇద్దరు హోంగార్డులు జగన్నాథపూర్ రైల్వేస్టేషనులో వలసకార్మికులను శ్రామిక్ స్పెషల్ రైళ్లలో ఎక్కిస్తూ విధులు నిర్వర్తించారు. ఇద్దరు హోంగార్డులకు కరోనా వైరస్ పాజిటివ్ అని రిపోర్టులో రావడంతో వారిని సీతాలపల్లిలోని కొవిడ్ ఆసుపత్రికి తరలించామని గంజాం జిల్లా ఎస్పీ చెప్పారు. ఒడిశా రాష్ట్రానికి వివిధ ప్రాంతాల నుంచి 80వేల మంది వలసకార్మికులు తిరిగివచ్చారు. వలసకార్మికుల  రాకతో గంజాం జిల్లాలోనే 368 కరోనా కేసులు వెలుగుచూశాయి. 

Updated Date - 2020-05-28T12:47:02+05:30 IST