ఇసుక టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2021-06-21T05:30:00+05:30 IST
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘ టన జిల్లాలోని మద్నూర్ మండల సరిహద్దులోని మహారాష్ట్రలోని దెగ్లూర్ లో రోడ్డుపై చోటు చేసుకుంది.
మద్నూర్, జూన్ 21: ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఇసుక టిప్పర్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందగా.. ఒకరికి తీవ్ర గాయాలైయ్యాయి. ఈ ఘ టన జిల్లాలోని మద్నూర్ మండల సరిహద్దులోని మహారాష్ట్రలోని దెగ్లూర్ లో రోడ్డుపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్నూర్ గ్రామానికి చెందిన శేషారావు కుటుంబం వడ్రంగి పని చేస్తూ బాన్సువాడలో జీవనం కొనసాగిస్తున్నారు. కుటుంబ పోషణ కోసం మహా రాష్ట్ర వెళ్లి వారం రోజులపాటు పనులు చేశాడు. తిరిగి దెగ్లూర్ నుంచి బాన్సువాడకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుకవైపు నుంచి ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. దీంతో భార్య ప్రేమల (40), మనుమరాలు పూర్ణిమ (5) అక్కడికక్కడే మృతిచెందగా శేషారావుకు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు దెగ్లూర్ ఎస్సై భగవాన్ తెలిపారు.