పార్కులో మరో రెండు సింహాలకు అస్వస్థత
ABN , First Publish Date - 2021-06-14T19:30:41+05:30 IST
ఈ జూలో మొత్తం 12 సింహాలు వుండగా, వాటిలో 9 సింహాల్లో
చెన్నై/అడయార్ : నగర శివారు ప్రాంతమైన వండలూరులోని అన్నా జూలాజికల్ పార్కులో ఉన్న సింహాలలో మరో రెండు సింహాలు అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వస్తున్నాయి. ఈ జూలో మొత్తం 12 సింహాలు వుండగా, వాటిలో 9 సింహాల్లో కరోనా లక్షణాలు వెలుగుచూశాయి. అందులో కూడా నిలా అనే ఒక ఆడ సింహం చనిపోయింది. ఈ నేపథ్యంలో మిగిలిన సింహాల నుంచి స్వాబ్ సేకరించి పరిశోధనా కేంద్రాలకు పంపించారు. ఈ నేపథ్యంలో కరోనా లక్షణాలున్న సింహాలలో మరో రెండు అస్వస్థతకు లోనయ్యాయని వార్తలు వస్తున్నాయి. జూలోని శునకాలు, పిల్లులు, కోతుల్లో ఇలాంటి లక్షణా లు ఏవైనా ఉన్నాయా? అనే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.