రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
ABN , First Publish Date - 2020-12-04T04:45:30+05:30 IST
ఎయిర్పోర్టు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
వల్లూరు, డిసెంబరు 3 : ఎయిర్పోర్టు సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిచ్చిన సమాచారం మేరకు కమలాపురానికి చెందిన పూలమహ్మద్సాదిక్ (25), ఇర్ఫాన్ (24) అనే ఇద్దరు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా ఎయిర్పోర్టు వద్ద అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ రాజగోపాల్ సంఘట నా స్థలానికి వెళ్లినట్లు సమాచారం.