రామాలయం భూమి పూజలో పాల్గొంటున్నా...ఉమాభారతి వెల్లడి

ABN , First Publish Date - 2020-08-05T16:21:01+05:30 IST

రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఆదేశాల మేర తాను రామాలయం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నానని బీజేపీ నాయకురాలు ఉమాభారతి బుధవారం ప్రకటించారు.

రామాలయం భూమి పూజలో పాల్గొంటున్నా...ఉమాభారతి వెల్లడి

అయోధ్య : రామజన్మభూమి తీర్థ ట్రస్టు ఆదేశాల మేర తాను రామాలయం భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నానని బీజేపీ నాయకురాలు ఉమాభారతి బుధవారం ప్రకటించారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు బుధవారం ఉదయం ఉమాభారతి రామాలయ నిర్మాణ స్థలానికి వచ్చారు. ‘‘నేను రాముడి భక్తురాలిని...రామజన్మభూమి ట్రస్టు ఆదేశాల మేర భూమి పూజ కార్యక్రమంలో నేను పాల్గొంటున్నాను’’ అని ఉమా భారతి ట్వీట్ చేశారు. గతంలో భూమి పూజ కార్యక్రమానికి దూరంగా ఉంటానని  ఉమా భారతి ప్రకటించారు. అయోధ్య నగరానికి వెళతానని, అయితే భూమి పూజ జరిగే చోటుకి మాత్రం వెళ్లనని, సరయూ నది తీరంలోనే ఉంటానని ఆమె ట్విట్టర్ ద్వారా గతంలో ప్రకటించారు. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, ఇతర కారణాలు ఏవీ లేవని ఆమె స్పష్టం చేశారు. భూమి పూజ జరిగిన చోటు నుంచి అందరూ వెళ్లిపోయిన తర్వాత ఆ స్థలానికి వెళ్తానని ఆమె స్పష్టం చేశారు.కాని రామజన్మభూమి తీర్థ ట్రస్టు సభ్యుల ఆదేశంతో తాను మళ్లీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఉమాభారతి తాజాగా ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-08-05T16:21:01+05:30 IST