బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, సెన్సెక్స్ దూకుడు

ABN , First Publish Date - 2022-02-01T16:21:52+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్

బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, సెన్సెక్స్ దూకుడు

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. మరికాసేపట్లో దీనిని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటుకు సమర్పిస్తారు. 


మరోవైపు సెన్సెక్స్ మంగళవారం 59,000 పాయింట్లకు చేరువగా దూసుకెళ్తోంది. నిఫ్టీ కూడా పరుగులు పెడుతోంది. హెల్త్‌కేర్ స్టాక్స్‌పై మదుపరులు దృష్టి పెట్టారు. ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెరుగుతాయనే ఊహాగానాలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. 


Updated Date - 2022-02-01T16:21:52+05:30 IST