440 మీటర్ల చంబా టన్నెల్
ABN , First Publish Date - 2020-05-27T07:59:09+05:30 IST
రద్దీ, ట్రాఫిక్ ఆటంకాలు లేని చార్ధామ్ యాత్ర కోసం రూ.12 వేల కోట్లతో చేపట్టిన చంబా టన్నెల్ నిర్మాణం పూర్తయింది.
రద్దీ, ట్రాఫిక్ ఆటంకాలు లేని చార్ధామ్ యాత్ర కోసం రూ.12 వేల కోట్లతో చేపట్టిన చంబా టన్నెల్ నిర్మాణం పూర్తయింది. ఉత్తరాఖండ్ చంబా జిల్లాలో అత్యంత జనసాంద్రత కలిగిన చంబా పట్టణం కింద ఈ టన్నెల్ను 440 మీటర్ల పొడవునా తవ్వారు. ప్రతిష్ఠాత్మకమైన చార్ధామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగమైన ఈ టన్నెల్ను సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్వో) పూర్తి చేయడం ఓ మైలురాయిగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అభివర్ణించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం ఆయన టన్నెల్ను ఆరంభించారు.
చంబా టన్నెల్