రైలు కింద పడి గుర్తు తెలియని యువతి ఆత్మహత్య?
ABN , First Publish Date - 2021-05-14T04:49:44+05:30 IST
కలికిరికి కిలోమీటరు దూరంలో పీలేరు మార్గంలో రైలు కింద పడి గుర్తు తెలియని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
కలికిరి, మే 13: కలికిరికి కిలోమీటరు దూరంలో పీలేరు మార్గంలో రైలు కింద పడి గుర్తు తెలియని ఒక యువతి ఆత్మహత్యకు పాల్పడింది. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో పాకాల నుంచి ధర్మవరం వైపు వెళుతున్న కోచింగ్ ప్రత్యేక రైలుకు చెందిన సహాయ లోకో పైలట్ ఈ సమాచారాన్ని కలికిరి స్టేషన్ మాస్టర్ కరుణాకర్కు తెలియజేశారు. ఆయన వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందజేశారు. కదిరి నుంచి వచ్చిన రైల్వే పోలీసు హెడ్ కానిస్టేబుల్ వై.సల్మాన్ మృత దేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయసు 25-30 ఏళ్ల మధ్య ఉంటుందని సల్మాన్ పేర్కొన్నారు. ఈ మేరకు కదిరి రైల్వే పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష కోసం యువతి మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.