డీఎస్పీ దేవేంద్ర మిశ్రాను చంపింది నేను కాదు: దుబే
ABN , First Publish Date - 2020-07-10T05:27:27+05:30 IST
లక్నో: డీఎస్పీ దేవేంద్ర మిశ్రాను తాను చంపలేదని గ్యాంగ్స్టర్ వికాస్ దుబే చెప్పినట్లు సమాచారం. తన గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారని దుబే చెప్పినట్లు తెలిసింది.
లక్నో: డీఎస్పీ దేవేంద్ర మిశ్రాను తాను చంపలేదని గ్యాంగ్స్టర్ వికాస్ దుబే చెప్పినట్లు సమాచారం. తన గ్యాంగ్ సభ్యులు కాల్చి చంపారని దుబే చెప్పినట్లు తెలిసింది. చాలాకాలంగా మిశ్రాను టార్గెట్ చేసుకున్న దుబేకు చౌబేపూర్ మాజీ స్టేషన్ ఆఫీసర్ వినయ్ తివారి ద్వారా వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తుండేవి. జులై రెండున బిక్రూ గ్రామానికి మిశ్రా వస్తున్నట్లు తెలుసుకున్న దుబే తన గ్యాంగ్ను పిలిపించుకున్నాడు. కాల్పుల్లో డీఎస్పీ మిశ్రాతో పాటు ముగ్గురు ఎస్ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోయారు. ఆ తర్వాత పోలీసుల డెడ్ బాడీలను పెట్రోల్ పోసి కాల్చేయాలనుకున్నట్లు దుబే పోలీసుల విచారణలో అంగీకరించాడు.
అటు వికాస్ దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ పోలీసులకు అప్పగించారు. దుబేకు ట్రాన్సిట్ రిమాండ్ విధించగానే ప్రత్యేక వాహనంలో అతడిని కాన్పూర్కు తరలిస్తున్నారు. అంతకు ముందు మధ్యప్రదేశ్ ఉజ్జెయిన్ మహాకాళేశ్వర్ మందిర్లో దాక్కున్న దుబేను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు దుబే భార్య రిచా దుబేను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. లక్నో కృష్ణానగర్ నుంచి దుబే భార్యను, కుమారుడిని, ఇద్దరు నౌకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.