తాడికొండ, తెనాలి ఘటనలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T06:13:15+05:30 IST

తాడికొండ మండలం లాం పాఠశాలలో విద్యార్థుల అక్రమ తరలింపు, తెనాలి ఎంఈవో అక్రమ వసూళ్ళపై సత్వరం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

తాడికొండ, తెనాలి ఘటనలపై చర్యలు తీసుకోవాలి

 గుంటూరు(విద్య), డిసెంబరు 3: తాడికొండ మండలం లాం పాఠశాలలో విద్యార్థుల అక్రమ తరలింపు, తెనాలి ఎంఈవో అక్రమ వసూళ్ళపై సత్వరం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్‌ అధ్యక్ష,కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. తాడికొండ విషయంలో ఏడీ-2ను విచారణ కోసం నియమించినా ఇంతవరకు దోషుల్ని తేల్చలేదన్నారు.    తెనాలి ఎంఈవో ఎస్‌జీటీ నుంచి రూ.40 వేలు ఎరియర్స్‌ కోసం వసూలు చేసినట్లు ఫిర్యాదు వచ్చినా  విచారణ జరగలేదన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని లేకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో నాయకులు షకీలాబేగం, ఆడిట్‌ కన్వీనర్‌ జగదీష్‌ తదితరులు పాలొన్నారు.

Updated Date - 2020-12-04T06:13:15+05:30 IST