‘18న స్పందనను వినియోగించుకోండి’
ABN , First Publish Date - 2021-10-17T06:17:43+05:30 IST
కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులపై దరఖాస్తు ఇవ్వాలని కలెక్టర్ పి. కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.
కర్నూలు(కలెక్టరేట్), అక్టోబరు 16: కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి స్పందన కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులపై దరఖాస్తు ఇవ్వాలని కలెక్టర్ పి. కోటేశ్వరరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల కేంద్రాల్లో తహసీల్దార్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధికారులు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో మండల స్థాయి అధికారులం దరూ తహసీల్దార్ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. కొవిడ్ నేపథ్యంలో అర్జీదారులు తప్పకుండా మాస్కులు ధరించి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు.