మాజీ సీఎం నారాయణ స్వామికి షాకిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం
ABN , First Publish Date - 2021-03-17T17:38:20+05:30 IST
మాజీ సీఎం నారాయణ స్వామికి కాంగ్రెస్ అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని పుదుచ్చేరి
పుదుచ్చేరి : మాజీ సీఎం నారాయణ స్వామికి కాంగ్రెస్ అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం లేదని పుదుచ్చేరి పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దినేశ్ గుండూ రావు వెల్లడించారు. ‘‘2021 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం నారాయణ స్వామి పోటీ చేయడం లేదు. ఎన్నికల వ్యవహారాలు, ప్రచారం బాధ్యతలను మాత్రమే చూసుకుంటారు.’’ అని దినేశ్ గుండూరావ్ సంచలన ప్రకటన చేశారు. మరోవైపు 14 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం నారాయణ స్వామి పేరు లేదు. సెల్వనదనె (కర్దిర్గాం), కన్నన్ (ఇందిరా నగర్), కార్తికేయన్ (ఒస్సుదు), రమేశ్ ప్రేంబత్ (మహే) నుంచి రంగంలోకి దిగనున్నారు. అయితే బల నిరూపణ సమయంలో ప్రభుత్వాన్ని సీఎం నారాయణ స్వామి గట్టెక్కించడంలో విఫలం చెందారన్న విమర్శల నేపథ్యంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే జాబితా నుంచి మాజీ సీఎం నారాయణ స్వామి పేరు ఎందుకు గల్లంతైందన్న విషయాన్ని మాత్రం అధిష్ఠానం ఎక్కడా వివరించలేదు.