ఎన్టీఆర్ వైద్యాలయంలో 60 మందికి వ్యాక్సిన్
ABN , First Publish Date - 2021-01-17T06:00:52+05:30 IST
ఎన్టీఆర్ వైద్యాలయంలో శనివారం 60 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు.
అనకాపల్లి టౌన్, జనవరి 16: ఎన్టీఆర్ వైద్యాలయంలో శనివారం 60 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పర్యవేక్షణలో అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగం వైద్యులు తిరుపతిరావు ఆధ్వర్యంలో అంబులెన్స్ డ్రైవర్ గపూర్కు ముందుగా వ్యాక్సిన్ ఇచ్చారు. 101 మంది ఎన్టీఆర్ వైద్యాలయం వైద్యులు, సిబ్బంది, ఇతర కార్మికులు వ్యాక్సిన్ కోసం రిజిస్ర్టేషన్ చేయించుకోగా, 60 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎవరికీ ఇబ్బందులు రాలేదని డాక్టర్ తిరుపతిరావు తెలిపారు. నూతన సంవత్సరంలో కొవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం శుభపరిణామని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో జె.సీతారామారావు, జోనల్ కమిషనర్ పి.శ్రీరామ్మూర్తి, ఎన్టీఆర్ వైద్యాలయం సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్కుమార్, వైసీపీ పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు దాడి రత్నాకర్, నాయకులుపలకా రవి, జాజుల రమేశ్, గొర్లి సూరిబాబు, ఆళ్ల నాగేశ్వరరావు, సూరిశెట్టి రమణఅప్పారావు పాల్గొన్నారు.