టీకాలు వేయించుకోకుంటే జీతాలు నిలిపేస్తాం
ABN , First Publish Date - 2021-02-25T04:59:12+05:30 IST
ఫ్రంట్ వారియర్స్ అందరూ ఈ నెలాఖరులోగా కరోనా టీకాలు వేయించుకోకపోతే వారి జీతాలను నిలుపుదల చేస్తామని ఎంపీడీఓ ఎం. రంగసుబ్బరాయుడు హెచ్చరించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లకు కొవిడ్ 19 కరోనా వ్యాక్సినేషన్పై బుధవారం అవగాహన కల్పించారు.
ఎంపీడీవో హెచ్చరిక
పామూరు, ఫిబ్రవరి 24: ఫ్రంట్ వారియర్స్ అందరూ ఈ నెలాఖరులోగా కరోనా టీకాలు వేయించుకోకపోతే వారి జీతాలను నిలుపుదల చేస్తామని ఎంపీడీఓ ఎం. రంగసుబ్బరాయుడు హెచ్చరించారు. స్థానిక వెలుగు కార్యాలయంలో సచివాలయ సిబ్బంది, గ్రామ వలంటీర్లకు కొవిడ్ 19 కరోనా వ్యాక్సినేషన్పై బుధవారం అవగాహన కల్పించారు. ప్రభుత్వం ఫ్రంట్ వారియర్స్గా గుర్తించి కరోనా వ్యాధి నివారణ టీకాలు ఉచితంగా మంజూరు చేసిందని, ఇంకా కొంత మంది ఉద్యోగులు టీకాలపై వస్తున్న వదంతులు నమ్మి వేయించు కోలేదని అన్నారు. జిల్లాలోనే పామూరు మండలం కరోనా వ్యాక్సినేషన్లో దారుణంగా వెనుకబడి ఉందని, ఉద్యోగస్తులందరూ కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నట్టు సంబంధిత వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రాలు తీసుకుంటేనే జీతాలు మంజూరు చేయాలని ఆదేశించినట్లు ఎంపీడీఓ తెలిపారు. ఫ్రంట్ వారియర్స్ అందరూ సకాలంలో టీకాలు వేయించుకొని ప్రజలకు టీకాల పట్ల భరోసా కల్పించి ఆదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్డీ వి. బ్రహ్మానందరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, వైసీపీ జిల్లా నాయకులు జి. హుస్సేన్రెడ్డి, రామిరెడ్డి, పామూరు ఉప సర్పంచ్ వైవీ సాయికిరణ్, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జీతాల బిల్లులు పంపించం
లింగసముద్రం : కరోనా వైరస్ నివారణకు గ్రామ వాలంటీర్లు అందరూ తప్పని సరిగా కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంపీడీవో కె. మాలకొండయ్య సూచించారు. కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని వలంటీర్లకు జీతాల బిల్లులు పంపించబోమని ఆయన చెప్పారు. మండలంలో 201 మంది వలంటీర్లు పని చేస్తున్నారని, వారంతా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకొన్నట్టు వైద్యాధికారి నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకువస్తేనే జీతాల బిల్లులు పంపుతామని చెప్పారు.