వాడపల్లి స్వామివారి హుండీల ఆదాయం రూ.38.27లక్షలు
ABN , First Publish Date - 2021-12-09T05:26:10+05:30 IST
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో హుండీల ఆదాయాన్ని పర్యవేక్షణాధికారులు పీవీవీఎస్ కామేశ్వరరావు, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు.
ఆత్రేయపురం, డిసెంబరు 8: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో హుండీల ఆదాయాన్ని పర్యవేక్షణాధికారులు పీవీవీఎస్ కామేశ్వరరావు, చింతలపూడి సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. 28 రోజులకు ప్రధాన హుండీల ద్వారా రూ.32,67,071, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.5,60,290 మొత్తం రూ.38,27,361 ఆదాయం లభించినట్టు ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. బంగారం 8 గ్రాములు, వెండి 263 గ్రాములు లభించిందన్నారు. విశ్వేశ్వరస్వామి హుండీ ఆదాయం 28 రోజులకు రూ.73,759 లభించింది. లెక్కింపులో చైర్మన్ రమేష్రాజు, ధర్మకర్తలు పి.సురేష్రాజు, ఏపుగంటి కనకారావు, శెనగన సత్యనారాయణ పాల్గొన్నారు.