ట్రాక్టర్పై ప్రయాణించి.. వాగు దాటిన ఉద్యోగులు
ABN , First Publish Date - 2021-12-01T03:51:04+05:30 IST
మండలంలోని వరికుం టపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమశిల, ఉప్పలపాడు, ముస్తాపురం, పీకేపాడు గ్రామాలకు
అనంతసాగరం, నవంబరు 30 : మండలంలోని వరికుం టపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సోమశిల, ఉప్పలపాడు, ముస్తాపురం, పీకేపాడు గ్రామాలకు వెళ్లలేని పరిస్ధితి నెలకొంది. కాగా బుధవారం పింఛన్ల పంపిణీ ఉండడంతో సచివాలయ ఉద్యోగులు ట్రాక్టర్పై ప్రయాణించి వాగు అవతలి గట్టుకు చేరుకు న్నారు. వారు వాగు దాటేందుకు జడ్పీటీసీ సభ్యుడు రాపూరు వెంకటసుబ్బారెడ్డి సహకారం అందించారు.