వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-28T03:30:12+05:30 IST

అక్షర కేంద్రాల ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు.

వంద శాతం అక్షరాస్యతే లక్ష్యం
అక్షర కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రత్యూష

ఎంపీడీఓ ప్రత్యూష


ముత్తుకూరు, అక్టోబరు 27: అక్షర కేంద్రాల ద్వారా వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఎంపీడీవో ప్రత్యూష పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బ్రహ్మదేవం, లింగాయపాళెంలోని అక్షర కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కలెక్టరు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అక్షర చైతన్య కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యతను నిర్మూలించాలన్నారు. వయోజనులకు విద్యను అందించేందుకు అక్షర కేంద్రాలు దోహదపడతాయన్నారు. నవంబరు నెలాఖరుకు రెండు వాచకాలను అభ్యసించడం ద్వారా అక్షరాస్యతను సాధించే దిశగా కృషి చేయాలన్నారు. మండలంలో 20 అక్షర కేంద్రాల ద్వారా వయోజనులకు చదవడం, రాయడం నేర్పిస్తున్నారన్నారు. అక్షర కేంద్రాల నిర్వహణ ద్వారా పూర్తి అక్షరాస్యతను సాధించేందుకు ప్రయత్నించాలన్నారు. 

Updated Date - 2021-10-28T03:30:12+05:30 IST