డీజిల్, పెట్రోల్పై వ్యాట్ను తగ్గించాలి
ABN , First Publish Date - 2021-12-06T04:03:52+05:30 IST
పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు.
- సైకిల్ తొక్కి నిరసన
నారాయణపేట, డిసెంబరు 5 : పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని సత్యనారాయణ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సైకిల్ తొక్కి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింగ్ మాట్లాడుతూ 1200 మంది అమరవీరుల త్యాగ ఫలంతో ఏర్పడిన రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం పెత్తనం చెలాయిస్తూ బానిస తెలంగాణగా మార్చిందని ఆరోపించారు. కేసీఆర్ తీరు మార్చుకోకపోతే రాబోవు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రఘువీర్, ప్రభాకర్ వర్దన్, రఘురామయ్య, రాందాస్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య, పుర మాజీ చైర్మన్ రాంచందర్ సాఖరే, మైనార్టీ మోర్చా అధ్యక్షుడు నసీర్, శ్రీనివాస్, రఘు, రాము పాల్గొన్నారు.