చమురుపై వ్యాట్ను తగ్గించాలి
ABN , First Publish Date - 2021-12-03T05:32:16+05:30 IST
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేప ట్టారు.
- కారును తాడుతో లాగి బీజేపీ నిరసన
జడ్చర్ల, డిసెంబరు 2 : పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను తగ్గిం చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేప ట్టారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్ ఐసీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కారును తాడుతో లాగుతూ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ యాదవ్ మా ట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిం చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లె తిరుపతి, ప్రతాప్రెడ్డి, అంజి, శ్రీకాంత్, కౌన్సిలర్ రాజు, నాగరాజు, నర్సిములు, వెంకట్, మధు, బీజేవైఎం నాయకులు సతీష్, నరేశ్, లాలు, వేణు, ఆంజనేయులు, ఆదిత్య పాల్గొన్నారు.