ఆలయంలో ప్రసరిస్తున్న సూర్యకిరణాలు
ABN , First Publish Date - 2020-03-27T10:06:48+05:30 IST
నాగలాపురం మండలంలోని వేదనారాయణస్వామి ఆలయంలో గురువారం సూర్య కిరణాలు మత్స్యావతారమూర్తి నాభిని తాకాయి.
మత్స్యవతార మూర్తి నాభిని తాకిన సూర్యకిరణాలు
నాగలాపురం, మార్చి 26: నాగలాపురం మండలంలోని వేదనారాయణస్వామి ఆలయంలో గురువారం సూర్య కిరణాలు మత్స్యావతారమూర్తి నాభిని తాకాయి. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి పరివార దేవతలకు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్నపన తిరుమంజన సేవ చేశారు. సాయం సంధ్యవేళ ఆకాశంలోని బాణుడి కిరణాలు ప్రధాన గోపురాన్ని దాటుకొని ధ్వజస్తంభం మార్గం గుండా వేదసంరక్షకుడి నాభిని తాకాయి. ఈ సుందర దృశ్యాన్ని తిలకించిన వేదపండితులు, ఆలయాధికారులు గోవింద నామ స్మరణలను స్మరిస్తూ భక్తి ప్రపత్తులతో పరవశించి పోయారు. అనంతరం ఆలయ పరిచారకులు సూర్య కిరణాలు ప్రచురించిన మార్గంలో పుణ్య జలాన్ని చిలకరించారు. సూర్యపూజ దర్శనాంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి అలంకరణలో అలంకరించి దీప, ధూప నైవేద్యాలు సమర్పించారు.