రైతుబజారులోనే కూరగాయల విక్రయాలు
ABN , First Publish Date - 2020-06-03T09:58:05+05:30 IST
పట్టణంలోని రైతుబజారులోనే కూరగాయల విక్రయాలు నిర్వహించాలని, బాదేపల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల
జడ్చర్ల, జూన్ 2 : పట్టణంలోని రైతుబజారులోనే కూరగాయల విక్రయాలు నిర్వహించాలని, బాదేపల్లి మార్కెట్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక కూరగాయల మార్కెట్లో ఇక నుంచి విక్రయాలు చేయొద్దని ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి తెలిపారు. బాదేపల్లి మార్కెట్లో కూరగాయలు విక్రయిస్తున్న వారితో మంగళవారం ఆయన మాట్లాడారు.
మార్కెట్ ఆవరణలో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం తెలంగాణ ధర్నా చౌక్ ప్రాంగణంలో శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, జడ్పీ వైస్చైర్మన్ కోడ్గల్ యాదయ్య, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.