వైభవంగా పేరంటాలమ్మ తెప్పోత్సవం
ABN , First Publish Date - 2022-01-20T05:53:28+05:30 IST
వైభవంగా పేరంటాలమ్మ తెప్పోత్సవం
గుణదల, జనవరి 19 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏటా నిర్వహించే రామవరప్పాడులోని వెంకమ్మ పేరంటాలమ్మ జాతర మహోత్సవాలు బుధవారం తెల్లవారుజామున తెప్పోత్స వంతో ముగిశాయి. అంతకుముందు రామ వరప్పాడు, ప్రసాదంపాడులో గ్రామో త్సవం జరిగింది. ఈ జాతర మహోత్సవాల్లో భక్తులు అమ్మవారికి హుండీల ద్వారా రూ.12.44 లక్షల ఆదాయం సమర్పించారని ఏవో పాతూరి లోకేశ్వరి తెలిపారు. ఉత్సవాలను విజయ వంతంగా నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించిన పోలీసు అధికారులను రామవరప్పాడు సర్పంచ్ వరి శ్రీదేవి, జడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, పాలక మండలి చైర్మన్ బోయిన భానుప్రకాష్ బుధవారం సన్మానించారు. గురువారం అన్న సంతర్పణ జరగనుందని చెప్పారు.