ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-09-30T03:29:22+05:30 IST
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం క్వారంటైన్లో
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన హోం క్వారంటైన్లో ఉన్నట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయ వర్గాలు ట్విట్టర్లో ట్వీట్ చేశాయి. ఇవాళ ఉదయం రొటీన్ టెస్టుల్లో భాగంగా ఆయనకు కోవిడ్-19 టెస్ట్ చేయగా.. పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ట్వీట్లో ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. ఆయనకు ప్రస్తుతం కరోనా లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని పేర్కొంది. వెంకయ్య నాయుడు భార్య ఉషానాయుడుకు నెగిటివ్ వచ్చిందని, ప్రస్తుతం ఆమె సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
నాన్న ఆరోగ్యం బాగుంది: కుమార్తె
వెంకయ్యకు కరోనా పాజిటివ్ రావడంపై ఆయన కుమార్తె దీపా వెంకట్ స్పందించారు. నాన్న ఆరోగ్యం బాగుందని తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించామని, వైరల్ లోడ్ చాలా తక్కువగా ఉందని ఆమె చెప్పారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దీపా వెంకట్ వెల్లడించారు.