సీఐ చితకబాదాడంటూ బాధితుల ఆందోళన
ABN , First Publish Date - 2021-08-02T06:22:56+05:30 IST
పట్టణంలోని గుత్తి ఆర్ఎస్ రోడ్డు డా ల్ఫిన కేఫ్ నిర్వాహకుడు లోకే్షపై అకారణంగా సీఐ రాము దాడి చేసి గాయపరిచాడని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.
గుత్తి, ఆగస్టు 1: పట్టణంలోని గుత్తి ఆర్ఎస్ రోడ్డు డా ల్ఫిన కేఫ్ నిర్వాహకుడు లోకే్షపై అకారణంగా సీఐ రాము దాడి చేసి గాయపరిచాడని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. దాడిని నిరసిస్తూ ఆదివారం ప త్తికొండ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వాహన రాకపోక లు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మురారి బాబు సంఘనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. ఈ విషయంగా సీఐ రామును వివరణ కోరగా, డాల్ఫిన కేఫ్ వద్ద కొందరు ఘర్షణపడుతుండగా గుత్తి ఆర్ఎ్సకు వెళ్తున్న తాను గమనించి సైరన ఇ చ్చానన్నారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో త ప్పని పరిస్థితిలో లాఠీ ఝుళిపించానన్నారు. ఘర్షణ పడు తున్న వారిని మందలించి పోలీసుస్టేషనకు తరలించామన్నారు. అయితే గొడవపడుతున్న వారిని తరిమికొట్టే క్ర మంలో కేఫ్ నిర్వాహకుడికి కూడా దెబ్బలు తగిలి ఉండవచ్చని సీఐ పేర్కొన్నారు.