విద్యాసామగ్రి పంపిణీ

ABN , First Publish Date - 2021-12-07T03:47:22+05:30 IST

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని విద్యార్థులకు సోమవారం సేవాభారతి ఆధ్వర్యంలో విద్యాసామగ్రి అందజేశారు. ఈ సందర్భంగా

విద్యాసామగ్రి పంపిణీ
కళాశాలలో విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తున్న కోట సునీల్‌కుమార్‌

 మనుబోలు, డిసెంబరు 6: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలోని విద్యార్థులకు సోమవారం సేవాభారతి ఆధ్వర్యంలో విద్యాసామగ్రి అందజేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సమరసత సేవా ఫౌండేషన్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోట సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ సేవాభారతి ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్ధులకు అవసరమైన అన్నిరకాల విద్యాసామగ్రిని అందిస్తున్నామ న్నారు. విద్యార్ధులు మంచిగా చదువుకుని కళాశాలకు, తల్లి దండ్రులకు మంచిపేరు తీసుకురావాలన్నారు.  కార్యక్రమం లో  ప్రిన్సిపాల్‌ వేణుగోపాల్‌, ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మనోజ్‌కుమార్‌, బీజేపీ మహిళామోర్చా నాయకులు రాజేశ్వరి, అధ్యాపకులు పాల్గొన్నారు.


Updated Date - 2021-12-07T03:47:22+05:30 IST