వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-10-17T17:51:43+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, బోడె ప్రసాద్‌లు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ టీడీపీ నేతలు

విజయవాడ: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌లు మండిపడ్డారు. పంట కాలవ రోడ్డు 3వ ఫేజ్ మిగిలిపోయిన నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ నల్లజెండాలతో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.


ఈ సందర్భంగా బోడె ప్రసాద్ మాట్లాడుతూ గత రెండున్నరేళ్లుగా పెనమలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఒక్క శాతం కూడా జరగలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి గంగూరు వరకు మూడు ఫేజుల్లో పంట కాలవ రోడ్డు అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. అందులో భాగంగా రెండు ఫేజ్‌లు అభివృద్ధి పూర్తి చేశామన్నారు. మూడో ఫేజ్ అభివృద్ధి పనులు 30 నుంచి 40 శాతం పూర్తి చేశామన్నారు. ఇంకా 60 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇప్పుడు ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అక్రమ ఇసుక, లిక్కర్ మీదే దృష్టి పెట్టిందని బోడె ప్రసాద్ ఆరోపించారు. 

Updated Date - 2021-10-17T17:51:43+05:30 IST