సచివాలయ ఉద్యోగులకు పే స్కేలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-07-30T04:50:19+05:30 IST
రెండేళ్ల సర్వీసు ఉన్న సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని కోరుతున్నారు.
చింతలపూడి, జూలై 29: రెండేళ్ల సర్వీసు ఉన్న సచివాలయాల ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ చేసి పే స్కేలు వర్తింపజేయాలని కోరుతున్నారు. సచివాలయాల పరిధిలో కార్యదర్శులుగా విధులను నిర్వర్తిస్తున్నామని పంచా యతీరాజ్ విద్య, రవాణా, గృహ నిర్మాణం, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షే మం వివిధ శాఖల్లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామ స్థాయిలో తనిఖీ చేసి బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ప్రమోషన్ ఛానల్ కల్పిస్తూ సీనియర్ అసిస్టెంటు స్థాయి పే స్కేలు అమలు చేయాలని ఇతర శాఖల మాదిరిగా మండల స్థాయిలో అధికారిని నియమించి, తమ బాధ్యతలు ఉండే విధంగా చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ సహాయ అధికారి మంగారత్నంకు సంక్షేమ ఉద్యోగులు గురువారం వినతిపత్రం అంద జేశారు. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నర్సాపురం మండలా లకు చెందిన సచివాలయ సంక్షేమ ఉద్యోగులు పాల్గొన్నారు.