స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ వాయిదా
ABN , First Publish Date - 2021-09-08T17:38:39+05:30 IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వేసిన పిటిషన్పై బుధవారం హైకోర్టు ముందు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్పై వివరణ వేసేందుకు సమయం కావాలని ధర్మాసనాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది బాలాజీ కోరారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.