విశాఖలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్ సెంటర్ ప్రారంభం
ABN , First Publish Date - 2021-05-14T15:49:40+05:30 IST
విశాఖ షీలానగర్లోని వికాస్ కళాశాలలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది.
విశాఖపట్నం: విశాఖ షీలానగర్లోని వికాస్ కళాశాలలో 300 పడకల ఆక్సిజన్ కొవిడ్ కేర్ సెంటర్ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం ప్రగతి భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయి రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.