విశాఖ జిల్లాలో మరో భూ దందా?.. భీమిలి బీచ్ రోడ్డులో 22 ఎకరాలపై కన్ను
ABN , First Publish Date - 2022-01-18T18:19:25+05:30 IST
విశాఖ: జిల్లాలో మరో భూ దాందాకు భీజం పడింది. పర్యాటకం పేరుతో భీమిలి బీచ్ రోడ్డులో 22 ఎకరాలపై..
విశాఖ: జిల్లాలో మరో భూ దాందాకు భీజం పడింది. పర్యాటకం పేరుతో భీమిలి బీచ్ రోడ్డులో 22 ఎకరాలపై కన్నేసినట్లు సమాచారం. అది కూడా అటవీ భూమి.. రెండు సంస్థలు దరఖాస్తు చేసుకోవడం, ఆ వెంటనే ఆమోదం తెలిపి.. ఫైల్ను ఢిల్లీకి పంపడం చక చక జరిగిపోయాయి. ఇదంతా చూస్తుంటే ఈ తతంగం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
విశాఖ, భీమిలి, భోగాపురం బీచ్ కారిడార్ అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ బీచ్ కారిడార్ను టూరిజం హబ్గా అభివృద్ధి చేస్తామని ఒక పాలసీని పర్యాటక శాఖ ప్రకటించింది. దాని ఆధారంగా బీచ్కు ఆనుకుని ఉన్న అటవీ భూములను లీజ్కు దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇక్కడ ప్రైవేటు స్థలాలు లేవు. అందుకే అటవీ భూములు కోరుతున్నామని నేరుగా చెబుతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.