అప్పన్న ఆలయంలో చందన మాలధార భక్తుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-29T16:45:13+05:30 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం సిహాంచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందన మాల ధరించిన భక్తులు ఆందోళనకు దిగారు.

అప్పన్న ఆలయంలో చందన మాలధార భక్తుల ఆందోళన

విశాఖపట్నం: ప్రముఖ పుణ్యక్షేత్రం సిహాంచలం సింహాద్రి అప్పన్న దేవాలయంలో చందన మాల ధరించిన భక్తులు ఆందోళనకు దిగారు. భక్తుల ఇరుముడులకు సరైన ఏర్పాట్లు చేయలేదని మండిపడుతున్నారు. దక్షిణాయనం పూర్తి కాకుండా మాలలు ముందుగా తీసి వేయాలంటూ అధికారులు చెప్పడం దారుణమన్నారు. మాలలతో స్వామి వారిని దర్శించుకున్న తరువాతే, మాలలు తీసే పద్ధతి ఉంటుందని తెలిపారు. భక్తులను కొండపైకి అనుమతించకుండా కింద ఏర్పాటు చేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-12-29T16:45:13+05:30 IST