గుర్తుతెలియని వాహన ఢీకొని వలంటీర్ మృతి
ABN , First Publish Date - 2021-06-18T05:38:27+05:30 IST
రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల - ఎర్రావారిపాలెం రోడ్డు మార్గంలో బోడిపాటివారిపల్లె సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలంటీర్ మృతిచెందాడు.
రొంపిచెర్ల జూన్17: రొంపిచెర్ల మండలం రొంపిచెర్ల - ఎర్రావారిపాలెం రోడ్డు మార్గంలో బోడిపాటివారిపల్లె సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వలంటీర్ మృతిచెందాడు. ఎస్ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. చిన్నగొట్టిగల్లు మండలం రంగన్న గారిగడ్డకు చెందిన వలంటీర్ వందనకుమార్(25) రొంపిచెర్ల మండలం పిచ్చిగుంట్లవారి పల్లెలోని అంత్యక్రియలకు హాజరయ్యాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా వర్షానికి మార్గమధ్యంలో చెట్టు రోడ్డుకు అడ్డుగా పడి ఉంది. దాన్ని తొలగించి వెళ్లే యత్నంలో ఉండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.